పాపం నయనతార.. ఆమె కష్టం ఎవరికి రాకూడదు.. పోస్ట్ వైరల్

by sudharani |
పాపం నయనతార.. ఆమె కష్టం ఎవరికి రాకూడదు.. పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: లేడీ సూపర్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార.. 2022లో విఘ్నేశ్ శివన్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు పది ఏళ్లు ప్రేమలో ఉన్న వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అంతే కాకుండా గతేడాది సరోగసీ ద్వారా ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఇక ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన నయన్ వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తుంది. అటూ విఘ్నేశ్ కూడా తన ప్రోఫిషన్‌లో బిజీగా ఉన్నాడు. ఇక కెరీర్‌తో మంచి ఫామ్‌లో దూసుకుపోతున్న ఈ ఇద్దరు దంపతులు.. టైం దొరికిన ప్రతీసారి తమ పిల్లలతో వెకేషన్‌లకు చెక్కేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సైతం సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌తో పంచుకుంటారు.

ఈ క్రమంలోనే మదర్స్ డే సందర్భంగా నయనతార తన ఇన్‌స్టా వేదికగా పెట్టిన ఓ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో నయన్ తన కొడుకును భుజాలపై ఎక్కించుకుని ఉండగా.. ఆ పిల్లడు నయన్‌ను నెత్తిమీద కొట్టేస్తున్నాడు. అంతే కాకుండా పిల్లల్నీ ఆడించేందుకు నయన్ చేస్తున్న పనులు నవ్వులు తెప్పించే విధంగా ఉన్నాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్ కావడంతో.. ‘పాపం నయనతార.. ఆమె కష్టం ఎవరికి రాకూడదు’ అంటూ ఫన్నీగా స్పందిస్తున్నారు నెటిజన్లు.

Next Story